Tuesday, October 8, 2013

ఎర్ర జాబిళ్ళ ఎరీన


పాటిబండ్ల రజని గారి "ఎర్ర జాబిళ్ళ ఎరీన"..కవితా సంకలనం లో కొన్ని కవితల గురించి
..మొదటి కవితే కదిలించేది గా వుంది."అబార్షన్ స్టేట్మెంట్". ఈ కవితలో తన అజాగ్రత్త వల్ల జరిగిందని రాస్తూ 
"భద్రతా వలయాన్ని ఎగతాళి చేసి//అక్రమంగా సరిహద్దును దాటే ఆకతాయల్లె//ఆ పద్నాలుగో రోజుకు అటో ఇటో//వద్దు వద్దు అనుకుంటూనే//అజాగ్రత్తగా //నేననుమతించిన అసమ్మతి కణాలతో//మరో సగభాగమై నువ్వెందులు కలిసావురా కన్నా?
 కానీ తానూ ఎందుకు వద్దనుకుందో రాస్తూ....పంచేందుకు రక్తం లేకే కదా//పెంచేందుకు తీరిక లేకే కదా// , తల్లడిల్లుతూనే , తప్పొప్పుల మధ్య తడబడుతూనే చేసుకొన్న అబార్షన్!, ఇక్కడ ఒక్కటి అర్థం కాలేదు. తాను వద్దనుకుని చేసుకున్న అబార్షన్ విదానాన్ని విమర్శిస్తూ "ఇంత సుఖంగా నిన్ను చంపుకొనే మార్గం కనిపెట్టిన వీళ్ళ ముఖాలపై //ఉమ్మ నీళ్ళ తో ఉమ్మేయ్యలని వెర్రి ఆవేశంగానూ// అంటుంది. తన   కడుపులో ఉన్న ఆ పిండానికి జన్మ నివ్వవద్దు అనుకొని , తన ఇష్టంగా చేసుకొనే ఈ అబార్షన్ ని విమర్శించడం అర్థం కాలే? చివరి పదాలు చూడండి " అయ్యో! //పాలింకి పొవాడానికి కున్నట్లు //మనసింకి పోవడానికీ మాత్రలుంటే ఎంత బావున్ను//

చోళీ కీ పీచె అన్న కవిత లో శరీరాదారంగా జరుగుతున్నా కుట్ర  ఎలా అవాంచనీయ కనజాలంగా పెరిగి పెరిగి క్యాన్సర్ గడ్డ గా మారిందో, దానికి రేడియో తెరపీ కి త్వర పడాల్సి వుంది అంటూంది. చోలీలు ఓణీ లు లేనప్పుడు //హృదయం వెన్నెలారబోసినంత పారదర్శకమై వుండేదేమో// జోడీలంతా వెన్ను విరుచుకొనే తిరిగే చోట//తన హృదయం విలాస వస్తువి చోళీలో కుంచిన్చుకోవలసి// అంటూంది. బడి పిల్ల నుంచి మొదలు కొని బామ్మగారి వరకు ఎంత వేదనో రాస్తూ బడిపిల్ల సర్డుకోక తప్పని యునిఫారం వెనుకా//పసితననుండీ పాపిట నేరిసిన్దాకా పాతివ్రత్యాన్నే నమ్మిన బామ్మ గారూ// కప్పుకోక తప్పని రవిక వెనుకా//ఉమ్మడి భాద్యతల కావడి కుండలూ,పాల సలుపులూ// అని ఎంత వేదన అనుభవిస్తున్నారో రాస్తుంది.

 ఉద్యోగిని ఆదివారం అనే కవితలో వ్యాపార ప్రకటనల్లో ఆదర్శంగా తీసుకోమనే గృహిణి వెనుక ఆమె పడే కష్టం ఎంతో హృద్యంగా వర్ణిస్తుంది. అందరికీ ఆదివారం , మరి తన ఆదివారం ఎలా ఉంటుందో ఈ కవితలో చెప్తుంది.పొంగిన పాలూ వలికిన చారు మరకలతో వంటిల్లు అందించే వారాంతపు రిపోర్ట్.తెగిన ఖాజాలు, ఊడిన గుండీలతో చింపిరి గంపి ఝాడిపించే  బట్టల స్టాండ్, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ కవితలో చివరికి ఇద్దరి జీతాలని ఈర్ష పడే వారెవరూ గృహిణి కి వుండే రెండు భాద్యతల పట్ల జాలి చూపరంటూంది. అన్ని భాద్యతల్నీ సమానంగా పంచుకునే మనం//మన బరువు దించేందుకు చేయి అందించారేమని నిలదీయాలి అని అంటుంది. ఇంకా మన పిల్లల నుంచైనా// ఇంటి పనంటే  ఇంతులది కాదని నేర్పాలి// అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చెయ్యాలి అని ముగిస్తుంది.

రెప్ప కాటేసిన పాప కథ అన్న కవితలో విద్యార్తినులపై లైంగిక వేదింపులు చేసే ఉపాద్యాయుల గురించి రాస్తూ. అయ్య వారికి చాలట అమ్మాయిల మానాలు//ఆడ పిల్లల కిపుడు కొత్త పాటాలు//భారత దేశం మన పితృ భూమి//భారతీయులందరూ మన బావ మరుదులు//గురు బ్రహ్మ// బ్రహ్మ కైనా తప్పదు రిమ్మ తెగులు// అంటూంది.చివరికి సిల్లబాస్ సవరించండి అంటూ కప్పల్ని కబళించే పాముల్ని గురించే కాక//కను "పాప"ల్నే కాటేసే రెప్పల విపరీతాన్ని కూడా ఒప్పులకుప్ప వయసున్నప్పటి నుంచే హెచ్చరించండి //అంటూ హెచ్చరిస్తుంది.

ఎర్ర జాబిళ్ళ ఎరీన అన్న కవితలో బాల వేశ్యల సంఖ్యలో రెండవ స్తానంలో ఉన్న దేశ దౌర్బగ్యాన్ని కేవలం బాల వేశ్యల కోసమే మన దేశానికి వచ్చే విదేశీ వింత పశువుల గురించి వాళ్ళ విక్రుతానందం  గురించి రాస్తుంది. గంగా తీరే రాక్షస రాతి సుఖ సారే//యమునా తీరే యమకూప విహారే//తాజాగా తల్లిపేగు తెంచిన తడిబొడ్లను తట్టలతో పేర్చం// మీ సెక్సీ బాత్ కోసం మా గోవా బీచ్//తడి దేరని పసి తనువుల ఇసుక పర్రలతో తయారుగా పక్క పరచి ఉంచింది//మీ దొరసాన్ల పాపలు// ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని//మురిసే ఆ పొద్దుకే వేళ//ఈ పాపసానులు//అయామ్ యువర్ నైట్మేర్ అంటూ// అధిరోహనకు అంగ చాస్తాయ్//కేవలం పర్యాటక మారకం చెల్లించి నంతనే దక్కే // పసి గాయాల ఫలహారాలు//ఇంకెక్కడైనా మీకు చిక్కెన ? అయ్యా అందుకే ఇది ఎర్ర జాబిళ్ళ ఎరీనా అంటుంది.కొన్ని కవితలు కదిలించేవిగా కొన్ని ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.