Monday, August 15, 2011

హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!



(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)

గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!

పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో

'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ  లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్ 
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!

పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !
 





Monday, August 8, 2011

వంశీ కవితలు



నెట్లో ఏదో వెదుకుతుంటే కనపడ్డ వంశీ కవితలు......






Sunday, July 24, 2011

నాదయిన సమస్యలు (శారద మనోగతం)


ఆలూరి భుజంగ రావ్ రాసిన "సాహిత్య బాటసారి - శారద "  లో   నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదని ఎంతో వేదన తో రాసిన శారద  మనోగతం మీ కోసం ...

"నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని, కాని హోటల్ చాకిరీ తప్పదు, చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు. పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను. అదీ సాధ్యం కావటం లేదు. తెలుగు మాత్రు భాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ, రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపికా లేదు. ఏ పున్యాత్ముడయిన  ఇస్తాడనుకుందాం. కోరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పని వాళ్లకి తెనాలి లో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన వచ్చిందో తెలియదు గానీ, నాతొ సహా నూటికి తొంబయి అయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణం లో చదువెక్కడ, రాత ఎక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తుంది కానీ, అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు లేబర్ ఆఫీస్ ఉంది. ఓ లేబర్ ఆఫీసరూ ఉన్నాడు.

హోటల్ సర్వరు కి చదువు ఎందుకు అనే పెద్దమనుషులూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరయిన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరుగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ  ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పయిగా ఈ ఉద్యోగం ఊడిపోవటం, రోజుల తరబడి పస్తులున్డటం జరిగింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుంది అనడంలో సంశయమేమి లేనప్పుడు మిగిలి ఉన్న జీవిత కాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తుంది. స్వతంత్రం వచ్చాక  ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం నా జీవిత ప్రయాణం వెనకటికన్న నూటికి ఇరవై పాల్లన్నా పెరుగుతున్దనుకున్నాను.

పత్రికల వారు  కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్చల రోగాన్ని నయం చేసుకోవడానికన్న సరిపోతాయేమో అని సంతోషించాను. అదీ వట్టిదయిపోయింది. ఈ పద్దతిలో  నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ  లేదనుకుంటాను.
( ఇది :తెలుగు స్వతంత్ర లో ఫిబ్రవరి 18 , 1949 లో ప్రచురితమయ్యింది)

సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)


ఎక్కడో తమిళ దేశం లో జన్మించి, చిన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం తెనాలి వచ్చి పొట్ట నింపుకోవడానికి హోటల్ సర్వర్ గా పని చేస్తూ, తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసి ౩౦ సం.ల చిన్న వయస్సులో ఫిట్స్ వ్యాధి తో మృత్యు వాత పడిన " శారద"  జీవితం గురించి ఎన్నో విషయాలు ఆనాటి తెనాలి లో శారద తో సన్నిహితంగా ఉన్న సహచరుడయిన శ్రీ ఆలూరి భుజంగ రావ్ గారు "సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)" స్మృతి శకలాలు పేరిట మనకందించారు.ఎందరో తమ కీర్తి, తమ రచనకు ప్రాచుర్యమూ కలగాలన్న కోరికతో శారద జీవితానికి చిలువలు, పలువలూ కల్పిస్తారన్న భయం కల్గి , ఆనాటి జీవిత పరిస్తితుల్ని వ్రాసి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రచన చేసినట్టుగా భుజంగ రావ్ గారు తన ముందు మాటలో తెలిపారు.



1937  లో మద్రాసులో బతకలేక వ్రుద్దుడయిన తన తండ్రి ని తీసుకొని నటరాజన్ తన పన్నెండేళ్ళ వయసులో ఆంధ్రా ప్యారిస్ తెనాలి లో అడుగు పెట్టి తన బావ అయిన భీమారావ్ హోటల్లో పనికి కుదిరి ప్రతిపలంగా ఇచ్చే పావులో-ఆర్తో సంపాదనతో ఓ చిన్న వూరింటిని అద్దెకు తీసుకొని తెనాలి లో తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికి అతనికి తమిళ సాహిత్యంతో పరిచయముంది. ఇక్కడ తెనాలి తో తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్తితి వచ్చి తెలుగు నేర్చుకొన్నాడు.రోజుకు పదహారు గంటలు అతి దుర్భరమయిన హోటల్ చాకిరీ చేస్తూ సాహిత్యం వైపు ఆకర్షితులయినాడు. 1946 లో ప్రజాశక్తి లో "ఎస్.నటరాజన్ " పేరిట " ప్రపంచానికి జబ్బు చేసింది" అన్న ఓ వ్యంగ్య రచన ప్రచురితమయ్యింది. ఇదే అతడి అచ్చయిన మొదటి రచన. మిత్రులతో కలిసి "ప్రజావాణి" అనే రాత పత్రిక ను ప్రారంభించాడు. 1946 -47 లలో  నటరాజన్ తన సాహిత్య పరిజ్ఞ్యానాన్ని విషయ పరిజ్ఞ్యానాన్ని పెంచుకొన్నాడు. అదే రోజుల్లో ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరి తెనాలి లో "జ్యోతి" అనే పక్ష పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక కారణంగా తెనాలి ఓ సాహిత్య కేంద్రంగా వెలసిన్దంటారు.అంతక్రితమే చక్రపాణి "యువ" కూడా తెనాలి నుంచే ప్రారంభించారు.1948  సం.జనవరి ౩౦ వ తారీకు జ్యోతి పత్రికలో " గొప్పవాడి భార్య" అనే ఒక వ్యంగ్య రచన శారద పేరున అచ్చయ్యింది, శారద పేరున అచ్చయిన మొదటి రచన ఇదే. నటరాజన్ సహజంగా సౌందర్యోపాసట అందుకే "శారద" అన్న మూడక్షరాల స్త్రీ నామం తనకు నచ్చి దాన్నే కలం పేరుగా పెట్టుకొన్నాడట. అక్కడి నించి శారద శర పరంపరలుగా రచించాడు. తను చూచిన ఎందరో అభాగ్యజీవుల్ని , దురాశాపరుల్నీ తన సాహిత్యంలో చిరస్మరనీయంగా చిత్రించాడు. ఇలా  సుమారు ఓ వంద కథలూ, కొన్ని నవలలూ రాశాడు. అతని కథలు విరివిగా ప్రచురితమయ్యి  పేరు సంపాదించే రోజుల్లో కూడా పొట్ట పోసుకోవతందుకు బస్ స్టాండ్లో పాత పుస్తకాలూ , చల్లని మజ్జిగా అమ్మే వాడు.ఇలా చివరి క్షణం వరకూ కష్టపడే బ్రతికాడు. కస్టపడి బ్రతికే మానవుల జీవితాల్ని తన రచనల్లో చిత్రించాడు.

 కథ గురించి శారద ఎం చెప్పాడట అంటే " కథకుడు ఎ చిత్రాన్నయినా సమగ్రంగా చిత్రించాలి, కథ చెప్పడంకూడదు, కథని కెమెరా సినిమాని చూపించినట్లు  చూపించాలనేవాడు.కథ చెప్పడం నాయనమ్మ పని అని , రచయిత తన ఆదర్శాన్ని ఊక దంపుడు ఉపన్యాసంగా చెప్పడాన్ని అంగీకరించేవాడు కాదు.కథలలో గానీ, నవలలో గానీ మనం చెప్పదలచుకున్న ఆదర్శం పూసలలో దారంలా ఉండాలంటాడు . కథ సాంతం చదివేసరికి పాటకుడు మన ఆదర్శాన్ని అంగీకరించే స్థితి కి రావాలంటాడు.ఆదర్శాన్ని విడిగా చెప్పడం అతడికి నచ్చదు. కథాకతనంలోనే తానూ చెప్పదల్చుకున్నది ఇమిడి ఉండాలి , ఆదర్శామూ రావాలి అనేవాడట.  

ఇలా  తెనాలి లో అడుగుపెట్టి హోటల్ వర్కర్ గా పనిచేస్తూ పర భాష అయిన తెలుగు నేర్చుకొని ఆకలి, దారిద్ర్యం ,కన్నీళ్ళ గురించి  తన కలం నుంచి ఎన్నో రచనలు చేస్తూ  , తండ్రి మరణంతో వచ్చిన మూర్చ వ్యాధి జీవితాంతం వెన్నంటి చివరికి ఆ మూర్చ తోనే జీవితం ముగించిన శారద జీవితం గురించి ఎన్నో విషయాలు, శారద వ్యక్తిత్వం గురించి , రచయిత ఈ రచనలో మనతో పంచుకుంటారు. శారద జీవితం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.

రచయిత: ఆలూరి భుజంగ రావు.
ప్రచురణ: చైతన్య వేదిక- తెనాలి
వెల      : రూ. ౩౦.౦౦ 

Tuesday, May 31, 2011

ఈ సమస్యకి పరష్కారం ఏంటి?




ఓ నాల్గు రోజులక్రింద నా ముందు నా సీట్లో పనిచేసిన నా ప్రేడిసెస్సర్ నుండి నాకి ఫోన్ కాల్.  సారాంశమేమిటంటే అతనిక్కడ ఉన్నప్పుడు ఇక్కడే మా వద్ద పని జేసే ఓ ఉద్యోగి తన లేడి కొలీగ్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ భార్యని , ఇంటిని పట్టిచ్చుకోవట్లేదు, న్యాయం చెయ్యండి అని ఆ ఉద్యోగి భార్య వచ్చింది , అని అయితే ఇది వ్యక్తిగతమయిన గొడవ, మేమేమి చెయ్యలేమమ్మ అంటే మీరలా అంటే ఈ ఆఫ్ఫిస్ ముందే నేను చచ్చిపోతాను అందట. అప్పుడు ఇదే  విషయం మెన్షన్ చేస్తూ ఓ పోలీసు కంప్లేంట్ ఇచ్చారట. ఇక్కడేమన్న చేసుకుంటే మనం జవాబుదారి కావాల్సి వస్తుంది, చెప్పినా ఏమి పట్టిచ్చుకోలేదు  అంటారు అనే ఉద్దేశం తో.  పోలీసు వాళ్ళుపిలిపించి కౌన్సెలింగ్ చేద్దమనుకుంటే, బయట ఏమయ్యిందో ఏమో తెలియదు కాని, అప్పటికి ఆ సమస్య అక్కడితో ఆగి పోయింది. చివరికి చెప్పిందేమిటంటే ఆమె మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఏమి చెప్తుందో వినండి  అని.  నేనన్నాను మీరన్నట్టు ఇది వ్యక్తిగతమయిన గొడవ, దీంట్లో మనమెలా కల్పించుకుంటాం. అప్పుడు ఆయన, నిజమే, మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆమె ఇంతకుముందు అన్నట్లు ఆమె మన ఆఫీసు లో గాని లేదా ఆఫీసు ముందు గాని ఎమన్నా చేసుకుంటే మనకే సమస్య కదా, ఆమె  మనకేమన్న ఫిర్యాదు చేస్తే అతని పై చర్య తీసుకుంటాం అని చెప్పండి, ఉద్యోగం పోతుందేమో అని  సరిగా ఉంటాడని వాళ్ళ ఉద్దేశం,  అంటే సరే రమ్మనండి , మాట్లాడతాను అని అన్నాను. తెల్ల వారి నేను ఆఫీసు లో ఉండగా ఆమె వచ్చింది. రాగానే    ఏడుస్తూ వేగంగా వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని వదల కుండా ఏడుస్తూ మీరే నాకు న్యాయం చెయ్యాలి అంటూంటే, నేను కంగారు పడి చివరికి ఆమెను కూర్చోపెట్టి , ఓ గ్లాసు మంచినీళ్ళు  తాగించి, కొంత స్తిమితపడ్డాక, చెప్పమ్మా , నీ సమస్య ఏంటి అన్నాను. ఆమె సమస్య ఆమె మాటల్లో.......................

భార్య మాటల్లో.........

మా వివాహం అయి  పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది. మాకు ఇద్దరు మొగ పిల్లలు. ఇద్దరూ హాస్టల్లో ఉంటారు. అతను నన్ను సరిగా చూసుకోవట్లేదు. నన్ను నా పిల్లల్ని  పట్టిచ్చుకోవట్లేదు. ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదు. ఓ ఏడెనిమిది నెల్ల క్రింద నుండి, ఆఫీసు లో ఉండే రమ (పేరు మార్చాను) తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏందని అడిగితె తాగి వచ్చి నన్ను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నాడు. చివరికి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది, నా ఆరోగ్యం చెడి పోతుంది. సెలవు రోజు పొద్దున్నే బయటికి పోతాడు. ఎలా ఉన్నదాన్ని ఎలా అయ్యానో చూడండి ( అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పాతది చూయించింది) ,ఇంట్లో టిఫిన్ కూడా చెయ్యడు, అన్నం తినడు ,ఎక్కడికి అంటే ఇప్పుడే వస్తాను అని వెళ్లి ఓ రాత్రి వరకు రాడు. రోజూ కూడా ఎ అర్ద రాత్రో వస్తాడు. నాతొ మాట్లాడడు . ఎందుకిలా అంటే కొడతాడు. ఈ మధ్య ఫ్రెండ్స్ తో శ్రీశైలం పోతున్న అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ని తెలుసుకుంటే అవును అన్నాడు. సరేలే ఫ్రెండ్స్ తో కదా అనుకున్న. అక్కడ ఉండగా ఫోన్ చేస్తే, ఫోన్లో ఆడవాళ్ళ గొంతులు, పిల్లల గొంతులు వినపడ్డాయి. ఇక్కడ విచారిస్తే అందరూ కుటుంబాల తో వెళ్లారు. అని. అది కూడా లీవ్ పెట్టింది, అంటే ఈనే దాని తో వెళ్ళాడు. వచ్చాక అడిగితె, నా ఇష్టం నువ్వేమన్నా సంపాయించు తున్నావ, ఉద్యోగం చేస్తున్నావా  అని మళ్ళీ కొట్టాడు. ఇంకోసారి ఇంటికి ఇంకా రాలేదని వెళ్లి ఆ రాత్రి విచారిస్తే , దానింట్లో ఇద్దరూ నగ్నంగా దొరికారు. గొడవ చేసి వచ్చా. ఆ తర్వాత రూం ఖాళీ చేసి ఇంకో చోట ఉంటుందట.  అది భర్త చనిపోతే , అది కూడా ఈ అక్రమ సంబందాల వల్లే , భర్త ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేస్తూ ఇలా వెలగ పెడ్తూంది. ఇతనితో కాక ఇంకో ఇద్దరి ముగ్గురితో కూడా సంబంధం ఉంది అని తెలిసింది. ఈయనేమో నా ఇష్టం అంటాడు.  

నా అన్నలు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నాకు దగ్గరి వాళ్ళు ఎవ్వరూ లేరు. మా మామయ్యా కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నీ కొడుకిలా చేస్తున్నాడు అని చెబ్తే, వాడు మగాడు, వాడిష్టం, పడి ఉండాలి అన్నాడు. నాకు  ఎవ్వరూ లేరు. ఆఫీస్ లో తెలిసిన పెద్ద మనుషులు చెప్పినా వినట్లేదు. ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఎంత సేపూ దాని చుట్టూ తిరుగుతున్నాడు. నేను గొడవ పెట్టి వచ్చిన తర్వాత , అది తల్లిని తీసుకొని నా ఇంటి మీదకు వచ్చింది. నా ఇల్లు ఖాళీ చేయించావు, నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి , ఇక్కడే ఉంటాను అని గొడవ పెట్టింది. అప్పుడు ఈయన ఇంట్లోనే ఉన్నాడు. నేను ధైర్యం చేసి బాగానే గొడవ పెట్టుకున్నాను. నీ మొగుడు  నా దగ్గరికి వస్తే నన్నేం చేయమంటావ్, నీకు దమ్ముంటే వాణ్ని రాకుండా ఆపుకో, నా ఇష్టం, అని గొడవ పడింది, బాగా గొడవ పెట్టి మొత్తానికి దాన్ని వెల్లగోట్టాను. అది పోయిన తర్వాత నన్ను బాగా కొట్టాడు.

 మీకంటే ముందు ఉన్న సార్ దగ్గరికి వచ్చి చెబ్తే, పోలిస్ కంప్లేంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు రమ్మన్నారు.కౌన్సెలింగ్  చేయటందుకు, అందరూ అన్నారు,   అతని ఉద్యోగం పోతుంది రోడ్డున పడతాడు అని, ఉన్న ఉద్యోగం పొతే పిల్లలు, కుటుంబం ఎట్లా అని ఆలోచించి, దగ్గరి పెద్ద వాళ్ళు చెప్పినట్లు, అతను మంచిగా ఉంటానంటే అక్కడికి వెళ్లలే. నా భర్త ఏమి చేశాడో ఏమో గాని, చివరికి వాళ్ళు నన్నే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా  అన్నావు అని కేస్ పెడతాం అని బెదిరించారు. భయపడి మంచిగా ఉంటానన్నాడు కదా అని అప్పుడు ఊరుకున్న. నా కొడుకు నవోదయలో చదువుతాడు, వాడి మార్కుల ను బట్టి హర్యానా లో సీట్ వచ్చింది, పంపియ్యాలంటే బయమవుతుంది, ఇక్కడ నాకు ఎమన్నా అయితే ఎలా అని. ఇప్పుడు అతనిలో ఏమీ మార్పు లేదు. ఇప్పటికి అలానే ఉన్నాడు. నాకు న్యాయం చెయ్యండి, మీరే ఏదయినా చేయండి, లేకపోతె నేను బ్రతకను, చచ్చిపోతాను.నా పిల్లలు అన్యాయమైపోతారు. మీరు  పిలిపించి మాట్లాడండీ. ఉద్యోగం పోతుందని చెప్పండి. మీరే నాకు దిక్కు , ఏదయినా చెయ్యండి. అతనిపై కేస్ పెడదామంటే  ఉద్యోగం పోతుంది, రోడ్డున పడతాం, పిల్లలు అన్యాయమైపోతారు,  ఉద్యోగం పొతే బ్రతకడం ఎలాగా, ఎలా అయినా అతన్ని మార్చండి. 

భర్త చెప్పింది  తర్వాతి టపాలో.........

Thursday, May 26, 2011

వర్గల్ - శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయము




అందరికి సరస్వతి దేవాలయం అనగానే " బాసర" గుర్తొస్తుంది. మీకిప్పుడు ఇంకో సరస్వతి దేవాలయం గురించి పరిచయం చేస్తాను. ఇదే "శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయము ".  ఇది హైదరాబాద్ నకు సుమారు 45  కి.మీ. దూరములో రాజీవ్ రాహదారి పై , కరీంనగర్ వెళ్ళు దారిలో , మెదక్ జిల్లా నందు వర్గల్ అను ఊళ్ళో (మండలం) కలదు.  రాజీవ్ రహదారి పై వర్గల్ x  రోడ్ నుండి ఈ  ఆలయం సుమారు ౩ కి.మీ. దూరం లో ఓ చిన్న గుట్టపై ఉంది. గుట్టపై చాలా ప్రశాంత మయిన వాతావరణంలో నిర్మిపబడిన ఆలయం కనులకు విందుగా ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయం కాకుండా, లక్ష్మీ  సమేత గణపతి ఆలయం, శని దేవాలయం కూడా ఒకే ప్రాంగణం లో కలవు. హైదరాబాద్ కి దగ్గరగా ఉండుట వల్ల  , సెలవు రోజులలో ,ముఖ్యంగా ఆదివారాలు ఇక్కడ రద్దీగా ఉంటుందట. మిగతా రోజుల్లో అంతగా రద్దీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నట్లు ఇక్కడ బస చేయాలనుకునే  వాళ్ళ కొరకు వసతి గదులు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం గురించి , అక్కడ ఉద్యోగులను విచారించగా, శ్రీ చంద్ర శేకర శర్మ అనబడే సిద్దాంతి ( ఇతను రైల్వే లో ఉద్యోగ విరమణ చేశారట) గారి కల్లో కి అమ్మవారు వచ్చి ఈ ప్రదేశం లో ఆలయం నిర్మింప జేయమని చెప్పారట. అప్పుడు వారు 1992  లో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని దీన్ని అభివృద్ధి చేశారట. ఈ ఆలయం ఇప్పుడు కంచి కామకోటి పీటం వారి ఆధ్యర్యంలో ఉంది. ఇంకా ఆలయ పూజారులు తెలియజేసిన ప్రకారం, గత నాలుగేళ్ళుగా ఈ ఆలయం  గురించి జనం  లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే భక్తులు ఎక్కువయ్యారట. ఇక్కడ అక్షరాభ్యాసం, ఇంకా అనేక రకాల పూజలు చేస్తారు.  ముఖ్యంగా రాత్రి ఆలయం మూసివేసే ముందు అమ్మవారికి అయిదు హారతులతో చేసే హారతి చూడవలసిందే, మాటల్లో చెప్పలేము. ఇది తప్పకుండా దర్శించవలసిన ఆలయం.  మీ కొరకు ఆలయ చిత్రాలు చూడండి. ఈ ఆలయం వెబ్సైట్ " www.srivargalvidyasaraswathi.org" . మెయిల్ అడ్రస్ " info@srivargalvidyasaraswathi.org".











Monday, May 23, 2011

రక్త దానం


నిన్న ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీ ఆఫీస్ లో చూసిన ఈ పోస్టర్ ఎందుకో నా మనసుకు నచ్చింది.  అమాయకంగా ఆ అబ్బాయి " Some one donated blood..That saved my life..Was it  you " అని అడుగుతున్నట్లున్న ఆ పోస్టర్ ఎందుకనో మనసుకు అలా హత్తుకుపోయింది. మీరూ చూడండి. ఈ రోజుల్లో రక్తదానం కూడా వ్యాపారం అయ్యింది. ఎప్పుడయినా , ఎక్కడయినా అవకాశమొస్తే వెంబడే  ఆలోచించకుండా రక్తదానం చేద్దాం. ఒక ప్రాణం రక్షించిన వాళ్ళల్లో మనమూ ఒకళ్లమవుదాం. ఏమంటారు!