Tuesday, December 6, 2011

బాపు మొదటి బొమ్మ



1945 లో "బాల" పత్రికలో అచ్చయిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ (అయిదోఫారం) మొదటి బొమ్మ.



Sunday, December 4, 2011

దిగంతం


ఏ రోజుకి ఆ రోజు జీవితమైపోతుంది...
ఉదయం పుట్టుక...!
రాత్రి మరణం....!
ఒక రోజు
ఒక జీవితం....!

ఏ రోజు కారోజు ఒక జీవితాన్ని గడిపినట్టు గడిపెయదమేనా..? నేను జీవించలేక మరణించిన రోజులేన్ని..?మూసేసిన ఫ్యాక్టరీ నుంచి... ఓ  పబ్లిషర్స్ లో సేల్స్మెన్ కం గుమస్తా, కం నౌఖర్  కం ఎవ్రీతిన్గాన్నై....నూటాదేబ్బై రూపాయల అద్దెతో , కుంటి మూగి ముసలి తల్లి తో  మురికి కూపంలో....చావలేక..కాబట్టి చచ్చే వరకూ బ్రతకాలి కాబట్టి బ్రతుకు వెళ్ళ తీస్తూ....అవసరం అన్నిటినీ అధిగమిస్తుంది   అంటాడు.


అయిదున్నర అడుగుల ఎత్తు ,చామన ఛాయా,మొటిమల కుచ్చుల మొఖం, పొడగాటి  ముక్కు, ఈ బాహ్య సౌందర్యం చూసి ఎవరోస్తారని....పెళ్ళంటే......



బెస్టియాల్  ఇన్స్టింక్ట్ టు రిప్రోడ్యుస్ ....ప్రత్యుత్పత్తి అనంతరం  పిల్లల పెంపకం సోషల్ ఆబ్లిగేషన్ (రెస్పాన్సిబిలిటీ అని సభ సాన్ఘీకులు   మేధావులు అంటారు)...ఫ్యాకరీ లాకౌట్ ..అందర్నీ మేపాలంటే,  ఎలా...అని పెళ్లి అనే దాన్ని తన నిఘంటువు లోనుంచి తీసేసి....."నేను నా ముఖాన్ని ఎక్కడో పారేసుకున్నాను, అప్పటినించి పారేసుకున్న నా ముఖాన్ని నేనే వెదుక్కుంటూ ఫేస్ లెస్ ఫేస్ తో సంచరిస్తూ....ముందు పరిగెత్తే నేను...వెనక తరిమే మరో నేనూ...నా నేనులు వేటాడేది  వెంటాడ్తోన్నదీ, గాలిస్తున్నదీ .....ఎక్కడో కోర్కెల దొమ్మీలో...ఏవో ఆశల తొక్కిసలాటలో...పారేసుకున్న ముఖాన్నే...మనిషి ముఖాన్నే..ఎంతకీ దొరకదా ముఖం...ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా....మెరిసే రైలు పట్టాలని చూస్తూ వాటి వెంబడే చూపుల్ని పరిగేట్టిస్తూ అలా  చీకట్లోకి ....ఊరి  చివర మినుకు మినుకు మంటూ దీపాలు చుక్కలు చుక్కలుగా ..అటునున్చింకా  దీర్గంగా మలుపు తిరుగుతూ రైలుపట్టాలు అనంతంగా దిగంతం లోకి....ది..గం....తం.ఎదురుగా ఆకాశం లోకి భూమి అంతమయ్యే చోటికి పట్టాలు మలుపు తిరుగుతూ..! ఎదురుగా...దిగంతం...నా కోసమే...అందులోనే  నా అంతం..నేనే ఓ దిక్కుని ..అదే..దిగంతం అంటూ ఆ దిగంతం గురించి ఆలోచనలు.

 రోజూ అతని ఆలోచనల్లో , అతని చుట్టూ కనిపించే అవిటి ముసలి తల్లి, ఇంటి ముందు పాయిఖానా పరిమళం, సాయిబాబా బంకు, నానా గందరగోలంగా వినిపించే అయ్యప్ప భక్తీ గీతాల రోద,పక్క వీధి లోనుంచి పాల కొరకు వచ్చే మాక్సీ  యువతీ, మధ మధ్య లో అతని ఆలోచనల్లో వచ్చే మీనన్ అనే అతని ఏకయిక స్నేహితుడు,  తనతో పాటు పనిచేసీ దేవక్రుపామని,అప్పుడప్పుడూ గుర్తొచ్చే తను కోల్పోయిన  తన ముఖం , పెళ్లి వద్దనుకున్నా  కలిగే లోపలి కోరికా దాన్ని తీర్చే నాగమణి, రైల్వే స్టేషన్ ఆమ్లెట్ బండి దుర్గ, రైల్వే క్వార్టర్స్ లో కనిపించే ఓ మాక్సీ , పోయిన్నెల చూపించే క్యాలెండర్, చూరు మీద సామన్లనుంచి  కనిపించే ఓ సైకిల్ ట్యూబ్...ఇలా అతని ఆలోచనలు నిరంతరం వీటి చుట్టూ పరిబ్రమిస్తూ...ఇందులో కథ ఎక్కువగా కనిపించదు.. కథానాయకుడు ,అతడు కేంద్రంగా    అతని చుట్టూ కనపడే జీవితం గురించి  అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం.ఈ ఆలోచనల్లో ఎక్కువగా తారసపడే పాత్రలు అతని తల్లి,  నాగరత్న అనే వేశ్య.

జబ్బు పడి చనిపోయిన నాగరత్నం..అతని కోరికలకి రూపం  ..ఆమె కి నేనేమైతానని ...చని పోయిన  నాగరత్నం స్తానంలో ఇంకో నాగరత్నం..పేరు పుష్ప ..అస్సలు నేనెవర్ని అని తన్ని తానూ వెతుక్కుంటాడు అస్సలు ఎవ్వరికి  ఎవరు అని ప్రశ్నించుకుంటూ...ఏది భ్రమ ...ఏది నిజం..భూమి  ఆకాశం కలవడం..నిజమయిన అబద్దం..! మనిషీ మనిషీ కలయిక కూడా అంతే...అది దిగంత సత్యం....ప్రతీ సంబంధం  పైకి కలిసినట్టు భ్రమ కలిగించేదే..! ఈ ప్రపంచం యావత్తూ ఓ నిరంతర భ్రమ..దిగంతం  లాగున...! అంటాడు. 


ఆతను ప్రేమించే ఆరాధించే ఏకయిక భావ చిత్రం అతని తల్లి.  భావరహితంగా ఉండే ఆమెకళ్ళు, ఆ కళ్ళల్లో శూన్యం, వెరసి ఆమె అతనికి ఆమె ఒక నిశ్శబ్ద చిత్రం..నిశ్శబ్ద ప్రాకృత చిత్రం. ఏదో తెలీని గుర్తించలేని ప్రాచీనత కల్గి...విశ్వ రహస్య సూత్రాల్ని తన ముఖం ముదతల్లో దాచుకున్న ఓ మహాద్బుత చిత్రం... ఎప్పుడూ ఆమె ముఖంలో నవ్వు చూడని అతనికి ఆమె ముఖంలో నవ్వు చూడాలని ఆతను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత , ఆమె  ముఖంలో  నిర్మలమై...అరిటాకు పొట్లం లో ముద్దా  గులాబీ లాగ అమ్మ పెదవులు విచ్చుకునే ఉంటాయి . శాశ్వత హాస రేఖ అయి....పై పెదవి ఆకాశం...కింది పెదవి భూతలం...! విచ్చుకున్న విశ్వాన్తరాల  కాంతులై చిరునవ్వు...! అమ్మ చిరునవ్వు...చూడలేనను కున్న చిరునవ్వు ..ఆమె పెదవుల మధ్య కుంచించుక పోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం.  దిగంతం చీలింది.

బాధ నన్ను బాధపెట్టడం మానేస్తున్దేమోనని ఆఖరికి కొన్నాళ్ళకి, నిజమే ...బాధ కూడా నిరంతరం కొనసాగితే మొనాటనస్ గా అయిపోయి నిర్వికారంగా   .....


ఇది రోజూ వచ్చే రాతిరే...ఇది నిన్నటి రేయి...రేపు కూడా వచ్చునోయీ...ఇది నిత్య నూతన యామిని...మరి సౌదామిని? అస్సలు వచ్చునా అని?

 నేను , జీవితం  రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికి కలవని పాత్రల ద్వారా నాయకుడి జీవితపు బండి దొర్లిపోతుంది. ఈ నవల ద్వారా రచయితా చెప్పదల్చుకున్నది "నేను" ప్రధానం, తతిమ్మ సంబందాలన్నీ మన జీవితపు బండి నడవడానికుపకరించేవే.


ఆలోచన పుట్టినప్పుడే నాకీ లోకం పుట్టింది. ఈ లోకం తోటే జీవితం  పుట్టింది, జీవితమే నేను అంటే ఆలోచనే నేనన్నమాట. అంటే ఈ యవత్ప్రపంచామూ, దాంతోటి జీవితమూ,అందులో నేనూ...అన్నీ..అన్నీ కలిపి ఈ బుర్ర్రలో  ఉన్నాయన్నమాట.దేన్నించి ఎవర్నించి పారిపొయినా ఆలోచన్నించీ మనిషి పారిపోలేదు కదా..! ఆలోచనంటే తనే...! తననించి తానూ పారిపోవటం సాధ్యం కాక మనిషి మల్లగుల్లాలు పది సంఘం అనబడే గుంపై, అన్నిటినీ వ్యవస్తీకరించుకున్నదేమో.




ఇలా ఎన్నో ...ఎన్నెన్నో... ఆలోచనల స్రవంతి...అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం. మొదలుపెట్టిన దగ్గర్నించి  చివరి పేజీ వరకు మనల్ని ఆపకుండా  చదివించే  కాశిబట్ల వేణుగోపాల్ నవల " దిగంతం"