Thursday, December 16, 2010

ప్రాణహిత పుష్కరాలు

ఇప్పుడు ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. రెండు రోజుల క్రింద అలా సరదాగా వెళ్లి చేసిన పుష్కర స్నానం, మరియు ఆ విశేషాలు మీతో పంచుకోవాలని ఈ టపా.  ప్రాణహిత గురించి తెలియని వాళ్లకోరకు....ప్రణీత నది వ్యవహార నామమే ప్రాణహిత. ఇది మహారాష్ట్ర లో ఉన్న సాత్పురా పర్వత కనుమలలో జన్మించి (అక్కడ దీనిని పెనుగంగా లేక వైన్య నది అంటారు) అక్కడి నించి వచ్చేటప్పుడు మహారాష్ట్రా లోని ఆస్తీ అనే ఊరి దగ్గర వరదా అనే మరొక నది వచ్చి వైన్య లో కలిసిపోయి తరువాత ప్రాణహిత అనే నదిగా ముందుకు సాగి ఆదిలాబాద్ జిల్లాలో కౌటాల తమ్మిది హేత్తి, వేమనపల్లి, కోటపల్లి మండలం అర్జున గుట్ట మీదుగా కాళేశ్వరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది. మేం పుష్కర స్నానాలకు ఆదిలాబాద్ జిల్లా లోని ఈ అర్జున గుట్ట వద్ద ఉన్న ప్రాణహిత నదీ తీరం వద్దకు వెళ్ళాం.  చెన్నూర్ కు సుమారు 22 కి.మీ. దూరం లో ఉన్న ఇక్కడికి వెళ్ళాలంటే నిర్మాణం లో ఉన్న జగదల్పూర్ NH16 మీదుగా వెళ్ళాలి. ఆర్ టి సి వాళ్ళు ప్రత్యెక బస్సులు ఏర్పాటు చేశారు. మేం కార్లో వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అభయారణ్యం గుండా కొంత దూరం పోయాక ఎడమ పక్క నించి దీనంగా , నీళ్ళు లేని గోదావరి మనతో పాటు చాలా దూరం వస్తుంది. అది చూస్తుంటే " గల గలా గోదావరి పరుగులిడుతుంటే"  అని పరవళ్ళు తొక్కుతున్న గోదావరి అన్నవి ఒక్కసారి గుర్తుకొచ్చాయి,   ఎక్కడ ఆ పరవళ్ళు  ఏవి ఆ పరుగులు,  అక్కడక్కడా ఉందీ లేనట్లుగా ఉన్న నీళ్ళతో ఉన్న గోదావరి తల్లి ని చూసి కాసేపు బాధ అనిపించింది. అర్జున గుట్ట వద్ద ప్రాణహిత సమృద్దిగా ఉన్న జల సంపదతో ముందుకు సాగుతుంది. ఇక్కడ లోతు బాగున్టుదట. వేసవి లో ఆవలి తీరం పోవాలంటే పడవల్లో వెళ్ళ వలసిన్దేనత. ప్రాణహిత కవతల మహారాష్ట్రా లోని శిరోంచ గ్రామం కనపడుతుంది. ఇలాగే  ముందుకు వెళ్ళిన ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది.అక్కడే సరస్వతి కూడా అంతర్వాహిని గా గోదావరిలో కలవడం వల్ల కాళేశ్వరం క్షేత్రానికి   త్రివేణి సంగమం  అని పేరొచ్చింది.  ఇలా సరదాగా వెళ్లి పుష్కర స్నానం చేసి వచ్చాం. సరదాగా  తీసిన చిత్రాలు మీకోసం ... 














 

1 comments:

ఇందు said...

నాకు తెలిసి ఒక నది సముద్రలో కాక...ఇంకో నదిలో సంగమిస్తే...దానికి పుష్కరాలు చేయరు అంటారు...మరి ఇది గోదావరిలో సంగమిస్తుంది కదా..మరి పుష్కరాలు ఎలా చేస్తున్నరు?