Monday, November 29, 2010

సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది



శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు ఆంధ్రప్రభ లో తమ " స్వీయ జీవన కథాకథనం" లో సూర్య రాయంధ్ర నిఘంటువు గురించి మరియి మరికొన్ని  ఆసక్తికరమయిన విషయాలు తెలియ జేశారు. వారి మాటల్లో

" నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని దర్శించేవాన్ని. ఆయన గొప్ప పండితుడు. సాదు శీలి. అమలాపురంలో కొంత కాలం హైస్కూల్ లో పని చేసి తర్వాత కాకినాడ లో కూడా ఉన్నత పాటశాల లో పనిచేశారు. కాకినాడ లో స్తిర పడ్డారు  రామారావు పేట లో ఉండేది ఇల్లు. కొంత కాలం ఆంద్ర సాహిత్య పరిషత్తు నిఘంటువు కార్యస్తానంలో పనిచేశారు. ఆ నిఘంటువు " సుర్యరాయాంద్ర నిఘంటువు". ఇది పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది. అయినా ఈ నిఘంటువు లో ఆధునిక తెలుగుభాషా స్వరూపం ఏ కొంచెము లేదు. వ్యవహారిక పదాలు అంటే నేడు వాడుకలో ఉన్నవి ఏ అయిదు శాతమో చెరాయేమో!. అర్థాలు చాలా వినోదం కలిగిస్తాయి.ఆ మహాపండితులను ఆక్షేపించడం  నిజానికి చాలా అపచారమే. అయితే వాళ్ళ సాహిత్య లోకం వేరు. సంప్రదాయ సాహిత్యం. సంస్కృతాంధ్రాల పరిపూర్ణ అధ్యయనం , లక్ష్యలక్షణ గ్రంధాల పట్ల అభినివేశం   వారి పరమ ప్రామాణిక నిష్ఠకు కొలబద్దలు. 20 వ శతాబ్దపు తెలుగు అభివ్యక్తితో వారికి పనిలేదు. కాబట్టి ఆమోదము అంటే పరిమళ మనీ, ఆయాసం అంటే ఇనుము సంబందమయినదనీ అర్థాలు మాత్రమె ఇస్తారు. కాని నేటి వాడుక అర్థాలు ఇవ్వరు. వాళ్లకు శతకాలు కూడా గుర్తుండవు.

 ఒక ఆసక్తికరమయిన ఉదంతం చెప్పారు వెంపరాల వారు. తాము నిఘంటు కార్యస్తానంలో పని చేస్తున్నప్పటిది. ఒకరోజు తాము ఊరి నుండి వస్తూ రైల్వే స్టేషన్ పక్కనే కదా ఆంద్ర సాహిత్య పరిషత్తు ఉన్నది, దారే కదా అని నిఘంటు కార్యస్తానం లోకి తొంగి చూశారుట.  మళ్ళీ ఇంటికి వెళ్లి  స్నాన సంధ్యానుస్తానాలు తీర్చుకొని రావడానికి ఎట్లానూ ఆలస్యమవుతుంది కదా అని. అప్పుడు చాలా పెద్ద పండితులక్కడ    "ఎద్దు" అనే ప్రయోగానికి ఆకారం కోసం అంటే ఆధారం కోసం చర్చిస్తున్నారట. బహు వచన ప్రయోగం కూడా అన్వేషిస్తున్నారట. అప్పుడు శాస్త్రి గారు సద్యః స్ఫురణంగా  ' వడి గల ఎద్దుల కట్టుక, మడి దున్నక బతకవచ్చు మహిలో సుమతీ' అనే ప్రయోగం గుర్తు చేశారట. అప్పుడా మహా పండితులంతా శాస్త్రి గారిని మెచ్చు కొన్నారుట. మా సమయం వృధా కాకుండా రక్షించావు అన్నారుట. శాస్త్రి గారు ఇక అప్పుడు ఇంటికి వెళ్లారు. ఎద్దును గూర్చి ఎన్నో నుడి కారాలున్నాయి.  సామెతలున్నాయి. అయినా అవి వాళ్లకు గుర్తు రావు. ' ఎద్దనవలె, మొద్దనవలె,గద్దనవలె కుందారపు  కవి చౌడప్ప' అని వాళ్లకు గుర్తు రాదు. కవి చౌడప్ప శతకం వాళ్లకు ప్రమాణం కాదు కాబట్టి ' ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి' అనే సామెత వాళ్లకు జ్ఞాపకం రాదు.

 ఇంకో చాలా ఆసక్తి కరమయిన సన్నివేశం చెప్పారు శాస్త్రి గారు. ఖండవల్లి నరసింహ శాస్త్రి గారని తమ  గురువు గారు చాలా గొప్ప వారు. ఇందుపల్లి లో ఆయన దగ్గర చదువుకుంటుండగా ఊళ్ళో  అప్పుడే కవిత్వ మల్లడం నేర్చుకుంటున్న ఒక భట్టుకవి గురువుగారి దగ్గరకు ఒక సమస్య తీసుకొని వచ్చారుట. ఒక ప్రయోగం అర్థం చెప్పల్సిందని అర్తిన్చాడుట.  ఏమిట్రా ప్రయోగం? ' ఔరగాకేయూర సహిత హతమౌరజితా ' అని. గురువుగారూ , ఆయన దగ్గర చదువుకొంటున్న తనవంటి శిష్యులూ తెల్లబోయారట.ఎవరికీ అర్థం తోచలేదు. 'మౌరజితా ' అనే పదం దగ్గరే అసలు చిక్కు 'హతమౌరజితా' ఏమిటని తలలు పట్టుకున్నారట. తరవాత చాలా కాలానికి ఆ సమస్య విడవదిందని చెప్పారు శాస్త్రి గారు. అది పరమ శివుడికి సంబందించిన సంబోదన అని మొదటి వర్ణన పదాల వల్ల తెలుస్తున్నది . ఉరగకేయూరుడు-పాములే దండ కడియాలు - భుజాలకు అలంకారాలు - ఇక రెండో వర్ణన ఏమిటంటే మురజిత్ అంటే  విష్ణు మూర్తి కదా . (మురారి) (నారీ నారీ నడుమ మురారీ...) మురజిత్ అంటే  విష్ణుమూర్తి  తద్దితాపత్యం - ఆయన కొడుకు మౌరజిత్ - అంటే మన్మథుడు -అంటే పరమశివుడు.- మన్మతున్ని హతం చేశాడు కదా! ఇది శివస్తుతి. మౌరజిత్ - శివుడు - ఓ శివహత మౌరజితా! అని సంబోదన వినడానికి చాలా ఆసక్తి కరంగా ఉంది. 

( ఆంద్ర భూమి ఆదివారం అనుబందం సౌజన్యంతో )

0 comments: